Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ కోసం వైఎస్ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు : ముద్రగడ ఆరోపణలు

టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కాల్పులు జరిపిన సినీ నటుడు బాలకృష్ణను కాపాడేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి కాళ్లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టుకోలేదా అని కాపు రిజర్వేషన్ పో

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (14:56 IST)
టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కాల్పులు జరిపిన సినీ నటుడు బాలకృష్ణను కాపాడేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి కాళ్లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టుకోలేదా అని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ఆరోపణలు చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ... తన బావమరిదిని రక్షించుకోవడానికి, ఆయన్ను చట్టం ఉచ్చు నుంచి తప్పించడానికి చంద్రబాబు దిగజారిపోయారన్నారు. కాపు ఉద్యమం పుట్టిందే చంద్రబాబునాయుడి వల్లని, ఉద్యమానికి మూల కారకుడు ఆయనేనని ముద్రగడ వ్యాఖ్యానించారు.
 
"మీ దయ వల్ల నాకు సిగ్గు, లజ్జ పూర్తిగా పోయాయి. ఎప్పుడూ నోటి నుంచి రాని పదాలు కూడా వస్తున్నాయి. మీరు మహా అయితే నన్ను ఆపేందుకు ఆఖరి అస్త్రంగా నా బట్టలు ఊడదీయించి, పోలీసుల బూటు కాళ్లతో తన్నిస్తారు. నన్నేమైనా చేసుకోండి. గతంలో మా జాతికి ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందే. అప్పటిదాకా ఊరుకోబోను" అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో ఆయన డిమాండ్ చేశారు.

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments