Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్ల చేతివాటం.. అనర్హులకు వైఎస్ఆర్ చేయూత పథకం..

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇంటి వద్దకే మెరుగైన సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గ్రామ వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అయితే, ఈ వలంటీర్లు పలుప్రాంతాల్లో తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలకు అనర్హులను ఎంపిక చేస్తున్నారు. ఇందుకోసం ఆ లబ్దిదారుల నుంచి ప్రతిఫలం పొందుతున్నారు. 
 
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో వలంటీర్లు ఏకంగా 21 మంది అనర్హులను వైఎస్సార్ చేయూత పథకం కింద ఎంపిక చేశారు. దీంతో ఈ వలంటీర్లపై అధికారులు అనర్హత వేటు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి మండలంలో జరిగిందీ ఘటన. 
 
నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాల్లో ఉన్నవారు వైఎస్సార్ చేయూత పథకానికి అనర్హులు. అయినప్పటికీ వివిధ గ్రామాల్లో ఈ పథకానికి అర్హత లేని 21 మందిని వలంటీర్లు నమోదు చేశారు.
 
దీనిని తీవ్రంగా పరిగణించిన అధికారులు 17 మంది గ్రామ వలంటీర్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో ఎస్‌వీఎస్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, 9 మంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments