Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్ల చేతివాటం.. అనర్హులకు వైఎస్ఆర్ చేయూత పథకం..

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇంటి వద్దకే మెరుగైన సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గ్రామ వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అయితే, ఈ వలంటీర్లు పలుప్రాంతాల్లో తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలకు అనర్హులను ఎంపిక చేస్తున్నారు. ఇందుకోసం ఆ లబ్దిదారుల నుంచి ప్రతిఫలం పొందుతున్నారు. 
 
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో వలంటీర్లు ఏకంగా 21 మంది అనర్హులను వైఎస్సార్ చేయూత పథకం కింద ఎంపిక చేశారు. దీంతో ఈ వలంటీర్లపై అధికారులు అనర్హత వేటు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి మండలంలో జరిగిందీ ఘటన. 
 
నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాల్లో ఉన్నవారు వైఎస్సార్ చేయూత పథకానికి అనర్హులు. అయినప్పటికీ వివిధ గ్రామాల్లో ఈ పథకానికి అర్హత లేని 21 మందిని వలంటీర్లు నమోదు చేశారు.
 
దీనిని తీవ్రంగా పరిగణించిన అధికారులు 17 మంది గ్రామ వలంటీర్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో ఎస్‌వీఎస్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, 9 మంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments