Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్ల చేతివాటం.. అనర్హులకు వైఎస్ఆర్ చేయూత పథకం..

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇంటి వద్దకే మెరుగైన సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గ్రామ వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అయితే, ఈ వలంటీర్లు పలుప్రాంతాల్లో తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలకు అనర్హులను ఎంపిక చేస్తున్నారు. ఇందుకోసం ఆ లబ్దిదారుల నుంచి ప్రతిఫలం పొందుతున్నారు. 
 
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో వలంటీర్లు ఏకంగా 21 మంది అనర్హులను వైఎస్సార్ చేయూత పథకం కింద ఎంపిక చేశారు. దీంతో ఈ వలంటీర్లపై అధికారులు అనర్హత వేటు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి మండలంలో జరిగిందీ ఘటన. 
 
నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాల్లో ఉన్నవారు వైఎస్సార్ చేయూత పథకానికి అనర్హులు. అయినప్పటికీ వివిధ గ్రామాల్లో ఈ పథకానికి అర్హత లేని 21 మందిని వలంటీర్లు నమోదు చేశారు.
 
దీనిని తీవ్రంగా పరిగణించిన అధికారులు 17 మంది గ్రామ వలంటీర్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో ఎస్‌వీఎస్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, 9 మంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments