Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిర్యానీ తినాలనే ఆశతో దేవుడు హుండీకే కన్నంవేసిన చిన్నారులు!! (video)

Advertiesment
West Godavari
, మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (10:50 IST)
ఆ ఇద్దరు చిన్నారులకు బిర్యానీ ఆరగించాలని ఆశ కలిగింది. కానీ, చేతిలే పైసా లేదు. మరి బిర్యానీ తినాలన్న ఆశ ఎలా నెరవేర్చుకోవాలి. అపుడే వారికి ఓ ఐడియా వచ్చింది. సమీపంలోని గుడిలో ఉన్న దేవుడి హుండీపై వారి కన్నుపడింది. అంతే.. ఆ హుండీని పగులగొట్టి.. అందులోని డబ్బులు తీసుకెళ్లి పుష్టిగా బిర్యానీ ఆరగించారు. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల ఆంజనేయస్వామి గుడిలో ఈ నెల 26వ తేదీ అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు పలుగుతో గుడి తాళం పగులగొట్టి, అదే పలుగుతో హుండీని ధ్వంసం చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఈ దొంగతనానికి పాల్పడింది అదే మండలంలోని జగన్నాథపురానికి చెందిన ఇద్దరు బాలురుగా గుర్తించారు. వారిని విచారించగా బిర్యానీ తినాలనే కోరికతోనే హుండీ పగుల గొట్టి అందులో నుంచి రూ.140 తీసుకున్నామని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. వారిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడ్ న్యూస్.. దేశంలో కరోనా కేసులు తగ్గాయట..!