Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుడ్ న్యూస్.. దేశంలో కరోనా కేసులు తగ్గాయట..!

గుడ్ న్యూస్.. దేశంలో కరోనా కేసులు తగ్గాయట..!
, మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (10:48 IST)
భారత్‌లో కరోనా కేసులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా నమోదైన కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 61 లక్షల 45 వేలు దాటింది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటలలో 70,589 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 61,45,292కు చేరింది. అలానే గడిచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 776 మంది మృతి చెందారు. దీంతో కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 96,318కు చేరింది.
 
గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 84,878 కాగా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 51,01,398కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా 9,47,576 యాక్టీవ్ కేసులు ఉండగా దేశంలో 82.58 శాతం కరోన రోగుల రికవరీ రేటు ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో 61 లక్షలు దాటిపోయిన కరోనా కేసులు...