Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబూ చిట్టీ లోకేశం.. నీకిదితగునా.. ట్రాక్టర్ ఎక్కడం వల్ల ఎంత ఘోరం జరిగింది.. సాయిరెడ్డి సెటైర్లు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (11:05 IST)
పశ్చిమగోదావరి జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్ళిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు ప్రాణాపాయం తప్పింది. జిల్లాలోని ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద నారా లోకేశ్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఉప్పుటేరు కాలువలోకి వెళ్లింది. 
 
అయితే ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వెంటనే అప్రమత్తమై ట్రాక్టర్‌‌ను అదుపు చేశారు. దాంతో లోకేశ్‌కు ప్రమాదం తప్పినట్టయింది. లోకేశ్ సురక్షితంగా బయటపడడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ ఘటనపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తనదైనశైలిలో సెటైర్లు పేల్చారు. 
 
అయితే, ఈ సందర్భంగా గుంతలో ట్రాక్టర్ చిక్కుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘బాబూ... చిట్టీ (లోకేశం)! ఇంతకీ నువ్వు ఎక్కిన ట్రాక్టర్‌ గుంతలో పడిందా... లేక నువ్వు ట్రాక్టర్‌ ఎక్కడం వల్ల భూమిలో గుంత పడిందా? ప్లీజ్‌ చెప్పు!’ అని విజయసాయిరెడ్డి చురకలంటించారు. 
 
కాగా, ఇటీవలి కురిసిన  భారీ వర్షాలకు జిల్లాలోని ఉండి నియోజకవర్గం, సిద్ధాపురం గ్రామంలోని చాకలి పేటలో ఇళ్లు ఇంకా నీట మునిగే ఉన్నాయి. ఇంట్లో అడుగు మేర పేరుకుపోయిన బురద, బయట చెరువును తలపిస్తోంది. రోడ్లపై ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉందని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments