బాబూ చిట్టీ లోకేశం.. నీకిదితగునా.. ట్రాక్టర్ ఎక్కడం వల్ల ఎంత ఘోరం జరిగింది.. సాయిరెడ్డి సెటైర్లు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (11:05 IST)
పశ్చిమగోదావరి జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్ళిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు ప్రాణాపాయం తప్పింది. జిల్లాలోని ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద నారా లోకేశ్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఉప్పుటేరు కాలువలోకి వెళ్లింది. 
 
అయితే ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వెంటనే అప్రమత్తమై ట్రాక్టర్‌‌ను అదుపు చేశారు. దాంతో లోకేశ్‌కు ప్రమాదం తప్పినట్టయింది. లోకేశ్ సురక్షితంగా బయటపడడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ ఘటనపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తనదైనశైలిలో సెటైర్లు పేల్చారు. 
 
అయితే, ఈ సందర్భంగా గుంతలో ట్రాక్టర్ చిక్కుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘బాబూ... చిట్టీ (లోకేశం)! ఇంతకీ నువ్వు ఎక్కిన ట్రాక్టర్‌ గుంతలో పడిందా... లేక నువ్వు ట్రాక్టర్‌ ఎక్కడం వల్ల భూమిలో గుంత పడిందా? ప్లీజ్‌ చెప్పు!’ అని విజయసాయిరెడ్డి చురకలంటించారు. 
 
కాగా, ఇటీవలి కురిసిన  భారీ వర్షాలకు జిల్లాలోని ఉండి నియోజకవర్గం, సిద్ధాపురం గ్రామంలోని చాకలి పేటలో ఇళ్లు ఇంకా నీట మునిగే ఉన్నాయి. ఇంట్లో అడుగు మేర పేరుకుపోయిన బురద, బయట చెరువును తలపిస్తోంది. రోడ్లపై ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉందని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments