Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ ఫైర్.. సిగ్గు అనిపించట్లేదా?

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (12:21 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ రఘురామ కృష్ణమరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రామతీర్థం ఘటనపై కృష్ణమరాజు తీవ్రంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరిగితే సిగ్గనిపించడంలేదా? అంటూ జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్‌కు హిందువులంటే అంత చులకనా? అని ప్రశ్నించారు. కొంతమంది చేస్తున్న వికృతి క్రీడ ఇలాగే కొనసాగుతుందంటే.. దీని వెనుక ఎవరైన పెద్దల హస్తముందా? అనే అనుమానం కలుగుతుందని, ఆ పెద్దలు ఎవరని ప్రశ్నించారు.
 
ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్లారంటే ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించడంలేదా? అని రఘురామకృష్ణమరాజు అన్నారు.
 
శ్రీరాముడంటే ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. ఇన్నాళ్లు ఎన్నో విగ్రహాలకు కాళ్లు, చేతులు నరికారని, ఇప్పుడు ఏకంగా శ్రీరాముడి తల నరికి ఎత్తుకెళ్లడమంటే ఇది హిందూ సమాజం మీద చేస్తున్న దాడిగానే భావిస్తున్నామని రఘురామ కృష్ణమరాజు అన్నారు.

సంబంధిత వార్తలు

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments