Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి ఛైర్మన్ కార్యాలయ సందేశాలే మార్ఫింగ్, తిరుమలలో దళారుల ఆటకట్టు..

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (20:45 IST)
తిరుమల శ్రీవారి భక్తులను నిలువు దోపిడీ చేసేందుకు దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి వచ్చిన మెసేజ్‌లను మార్ఫింగ్ చేసి భక్తులను మోసగిస్తున్న ఇద్దరు దళారులను తిరుమల పోలీసులు అరెస్టు చేశారు.
 
భువనగిరికి చెందిన 11 మంది భక్తుల వద్ద నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తామంటూ 16,500 రూపాయలకు కిషోర్, నాగరాజు అనే దళారులు బేరం కుదుర్చుకున్నారు. ముందుస్తుగా భక్తుల వద్ద నుంచి ఎనిమిది వేల రూపాయలు అడ్వాన్స్‌గా దళారులు పొందారు.
 
అయితే ఇవాళ టిటిడి ఛైర్మన్ క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్న భక్తలు ఆ మెసేజ్‌ను టిటిడి సిబ్బందికి చూపించగా ఆ మెసేజ్ ఫేక్ మెసేజ్‌గా గుర్తించి భక్తులకు తెలిపారు. దీంతో మోసపోయామని గుర్తించిన భక్తులు టిటిడి విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు.
 
భక్తుల వద్ద నుంచి ఫిర్యాదు స్వీకరించిన విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దళారులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments