Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు కోటేశ్వరమ్మ ఇకలేరు

Webdunia
ఆదివారం, 30 జూన్ 2019 (11:30 IST)
మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు కోటేశ్వరమ్మ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ మాంటిస్సోరి పాఠశాలలు, ఇంటర్ డిగ్రీ కళాశాలల ద్వారా లక్షలాది మందికి విద్యాదానం, స్త్రీ విద్య, సమాజ నిర్మాణం, మహిళా సాధికారత కోసం కృషి చేశారు. 
 
కోటేశ్వరమ్మ ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ 1955లో మాంటిస్సోరి పాఠశాల స్థాపించారు. కేవలం విద్యార్ధినుల కోసమే ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు చేశారు. మాంటిస్సోరి విద్యా విధానంలో నర్సరీ నుంచి పీజీ వరకు, సాంకేతిక విద్యా విధానంలో బీఈడి, ఫార్మసీ, లా, ఇంజనీరింగ్ విద్యా సంస్థల మందులకి మహిళలను విద్యావంతులను చేసేందుకు ఎనలేని కృషి చేశారు. 
 
మాంటిస్సోరి విద్యాసంస్థలలో మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి, మాజీ ఎంపీ మాగంటిబాబు, ఐ.ఎ.యస్ అధికారి ఉషాకుమారి, డాక్టర్ రమేష్ తదితరులు విద్యను అభ్యసించారు. 1925లో జన్మించిన కోటేశ్వరమ్మ 92 ఏళ్ల వయసులో పద్మ పురస్కారం అందుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు పలు అవార్డులు సాధించారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments