Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాపై దాడి.. లిఖితపూర్వక క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు

ఠాగూర్
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (12:12 IST)
తెలుగు మీడియా టీవీ9కు చెందిన విలేకరిపై దాడి చేసి గాయపరిచిన కేసులో సినీ నటుడు మోహన్ బాబు లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఆ మీడియా సంస్థకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన టీవీ9 యాజమాన్యానికి ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు. తన కుటుంబ ఘటన పెద్దదిగా మారి టీవీ9ను, జర్నలిస్టులను ఆవేదనకు గురిచేసినందుకు చింతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
 
ఈ ఘటన అనంతరం 48 గంటల పాటు ఆసుపత్రిపాలు కావడంతో వెంటనే స్పందించలేకపోయానని తెలిపారు. ఆ క్షణంలో గేటు విరగ్గొట్టి 30 మంది లోపలికి ఉరుక్కుంటూ వస్తుంటే సంఘ వ్యతిరేక శక్తులు వస్తున్నారేమో అని తాను ఆందోళనతో ఆ పని చేశానని పేర్కొన్నారు. ఆ రోజు ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టు గాయపడటం చాలా బాధించిందన్నారు.
 
తన వల్ల జరిగిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నానని, టీవీ9 టీంకి, జర్నలిస్ట్ మిత్రుడు రంజిత్ కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. 'మీకు, మీ కుటుంబానికి కలిగిన మనోవేదనకు చింతిస్తున్నా'నని మోహన్ బాబులు తన లేఖలో తెలిపారు.
 
కాగా, ఈ ఘటనలో ఇప్పటికే మోహన్ బాబుపై 118(1) బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదయిన విషయం తెలిసిందే. అలాగే లీగల్ ఒపీనియన్ తీసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు.. గురువారం ఆయనపై 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments