Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు.. ఇది చెంపపెట్టు.. కేసీఆర్‌కి కితాబిచ్చిన ఎమ్మెల్యే రోజా

Webdunia
శనివారం, 12 ఫిబ్రవరి 2022 (18:00 IST)
ఏపీ విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం కమిటీ వేసిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీతో రాజీపడ్డ చంద్రబాబుకు.. ఇది చెంపపెట్టు అని ఎమ్మెల్యే రోజా అన్నారు. మన కష్టం, నష్టం గమనించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. 
 
వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని, ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు రోజా. విభజన సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ చేసిన పోరాటానికి ఫలితం దక్కనుందని రోజా చెప్పారు. 
 
ఏపీ విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం కమిటీ వేయడం శుభపరిణామం అని రోజా తెలిపారు. ఇది సీఎం జగన్ సాధించిన విజయంగా అభివర్ణించారు. గత నెల కూడా సీఎం జగన్ విభజన సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని రోజా చెప్పారు.
 
మరోవైపు యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని నగిరి ఎమ్మెల్యే రోజా కొనియాడారు. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి రోజా దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ కాలంలో ఏవరికి దక్కని అవకాశం కేసీఆర్‌కు దక్కిందన్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇక్కడికి తీసుకువచ్చిన రాయి గుంటూరు నుంచి తీసుకు వచ్చారని, ఎప్పటికీ తెలుగువారు అన్నదముళ్ళు, అక్కచెల్లెలుగా కలిసి ఉంటారని రోజా స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments