తూర్పుగోదావరి జిల్లాలో గురువారం జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ... కాపులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తుంటే పవన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్నని చెప్పుకున్న జనసేనాని ఇప్పుడు జీఎస్టీ వల్ల పడబోతున్న పన్నుపోటు గురించి ఎందుకు అడగడం లేదని ఆమె విమర్శలు చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేతలపై కూడా రోజా నిప్పులు చెరిగారు. గిరిజనుల ఓట్ల కోసం కొండలు ఎక్కి వారిని కలిసే రాష్ట్రమంత్రులు.. ఇప్పుడు గిరిజనుల ఆరోగ్యాలు పాడైపోతుంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదని అన్నారు.
పరిపాలనకు మానవత్వాన్ని జోడించి మహానేత వైఎస్ చేసిన పాలన చరిత్రగా మిగిలిపోతుందన్నారు. చంద్రబాబు అధికారాన్ని చేపట్టే ముందు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నిలుపుకోలేదన్నారు.