Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ నిజాలు మాట్లాడేస్తున్నారని బాబు ట్విట్టర్లో కూర్చోబెట్టారు: రోజా ఎద్దేవా(Video)

నాలుగేళ్లపాటు భాజపాతో అధికారం పంచుకుని ఇప్పుడు బయటకు వచ్చేసి పోరాటం చేస్తామని చెప్పడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని వైసీపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సీఎం రమేష్ చెప్పడం పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొ

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (18:44 IST)
నాలుగేళ్లపాటు భాజపాతో అధికారం పంచుకుని ఇప్పుడు బయటకు వచ్చేసి పోరాటం చేస్తామని చెప్పడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని వైసీపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సీఎం రమేష్ చెప్పడం పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొకటి కాదన్నారు. అధికారంలో వున్నన్నాళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు ధర్మపోరాటం అంటూ ఫ్యాన్లు కింద కూర్చుని నిత్యానంద స్వామిలా ఆయన ఆశీర్వదిస్తున్నారంటూ చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు రోజా. 
 
నారా లోకేష్ గురించి మాట్లాడుతూ... లోకేష్ గారు ట్విట్టర్లో కామెంట్లన్నీ ఎవరో రాసినవి అప్ లోడ్ చేస్తుంటారని అన్నారు. ఆయన ఎంత నిజంగా మాట్లాడుతారో అందరికీ తెలుసునన్నారు. తమ పార్టీ బంధుప్రీతిని కలిగిన పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నదేమిటో తేటతెల్లం చేశారన్నారు. అందుకే చంద్రబాబు నాయుడుకి భయం వేసి ఆయనను ట్విట్టర్లో కూర్చోబెట్టారని అన్నారు. చూడండి ఈ వీడియోలో ఆమె వ్యాఖ్యలు... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments