ఒక అమ్మకీ, అబ్బకీ పుట్టిన వాళ్లయితే అలా చేయరు... రోజా ఫైర్

ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సందర్భంలో విలేకరి రోజాతో... నంద్యాల ఉపఎన్నికల ఫలితాల తర్వాత మీకు గుండు కొట్టించినట్లు ఫోటోలు పోస్ట్ చేశారు... దీనిపై స్పంద

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (19:14 IST)
ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సందర్భంలో విలేకరి రోజాతో... నంద్యాల ఉపఎన్నికల ఫలితాల తర్వాత మీకు గుండు కొట్టించినట్లు ఫోటోలు పోస్ట్ చేశారు... దీనిపై స్పందన ఏమిటని అడగ్గానే ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అమ్మకీ, అబ్బకీ పుట్టిన వాళ్లయితే ఇలా చేసి వుండరు. 
 
భారతదేశ సంప్రదాయంలో గుండు ఎప్పుడు కొడతారో తెలుసా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివారిని చెప్పుతో కొట్టాలనుకున్నాను. సభ్యత సంస్కారం వుంది కనుక మౌనంగా వుండిపోయాం. అసలు నంద్యాల ఉప ఎన్నికల్లో నేను పోటీ చేశానా అని ప్రశ్నించారు. సవాళ్లు చేసింది వాళ్లే ఇలాంటి పనులు చేయించిందీ వాళ్లే. తెదేపాలో కొందరు ముఖ్యమైనవాళ్లే ఇలాంటి పని చేయించారన్న సమాచారం నావద్ద వుంది. తెదేపా నాయకుల భార్యలు, కుమార్తెల ఫోటోలను ఇలా పెడితే వాళ్ల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. 
 
అసలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విశృంకలత్వం తారాస్థాయికి చేరిపోయింది. సంబంధం లేని ఫోటోలను జతచేసి నగ్నంగా ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. మా పిల్లలు ఫోన్లలో ఆడుకుంటుంటారు. వారి కంటపడితే ఏంటి సంగతి.. ఇలా మార్ఫింగ్ ఫోటోలు, అసభ్య రాతలు రాసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని రోజా డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments