Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (11:15 IST)
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మౌనదీక్షకు దిగారు. హిందూపురం ప్రధాన కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించాలని కోరుతూ ఆయన ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష పార్టీలకు అతీతంగా జరుగుతుంది. 
 
ఈ దీక్ష తర్వాత ఎమ్మెల్యే హోదాలో ఆయన అన్ని పార్టీల నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా భేటీ అవుతారు. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుని ప్రభుత్వానికి విన్నవించనున్నారు. 
 
ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లా ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెల్సిందే. దీంతో కొత్త జిల్లా ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక వస్తుంది. పైగా, తమ ప్రాంతాలను కేంద్రంగా చేసి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 
 
ఇందులోభాగంగా, హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుంటే, హిందూపూర్‌లోని అధికార వైకాపా కౌన్సిలర్లు కూడా ఒకతాటిపైకి వచ్చి హిందూపూర్‌ను జిల్లా కేంద్రంగా చేయడానికి తమ మద్దతును ప్రకటించారు. మరోవైపు పెనుగొండ ప్రజలు కూడా తమ ప్రాంతాన్ని జిల్లా ప్రధాన కార్యాలయం చేయాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన కాజల్ అగర్వాల్ సత్యభామ

ఆ హీరోతో ఆగిపోయిన టైటిల్ కళ్యాణ్ రామ్ కు పెడుతున్నారా?

ప్రభాస్ "కల్కి" ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.191.5 కోట్లు!!

కల్కి 2898 AD చిత్రం మొదటి రోజు కలెక్షన్ ఇదే

ఏపీలో విజయం తెలంగాణపై ఉంటుంది - తెలంగాణ లో పవన్ కళ్యాణ్ పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments