Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (11:15 IST)
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మౌనదీక్షకు దిగారు. హిందూపురం ప్రధాన కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించాలని కోరుతూ ఆయన ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష పార్టీలకు అతీతంగా జరుగుతుంది. 
 
ఈ దీక్ష తర్వాత ఎమ్మెల్యే హోదాలో ఆయన అన్ని పార్టీల నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా భేటీ అవుతారు. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుని ప్రభుత్వానికి విన్నవించనున్నారు. 
 
ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లా ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెల్సిందే. దీంతో కొత్త జిల్లా ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక వస్తుంది. పైగా, తమ ప్రాంతాలను కేంద్రంగా చేసి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 
 
ఇందులోభాగంగా, హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుంటే, హిందూపూర్‌లోని అధికార వైకాపా కౌన్సిలర్లు కూడా ఒకతాటిపైకి వచ్చి హిందూపూర్‌ను జిల్లా కేంద్రంగా చేయడానికి తమ మద్దతును ప్రకటించారు. మరోవైపు పెనుగొండ ప్రజలు కూడా తమ ప్రాంతాన్ని జిల్లా ప్రధాన కార్యాలయం చేయాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments