Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల పొత్తు పెట్టుకున్న టీడీపీ - కాంగ్రెస్ పార్టీలు

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (10:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్ధశత్రువులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయి. ఎన్నికల్లో విజయం కోసం పొత్తులు పెట్టుకున్నాయి. పోర్టు బ్లెయిర్ పురపాలక సంస్థకు జరిగే ఎన్నికల కోసం ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇందులో టీడీపీ మూడు వార్డుల్లో పోటీ చేస్తుంటే మిగిలిన వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. 
 
అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ మున్సిపాలిటికీ ఈ నెల 6వ తేదీన పోలింగ్ జరుగనుంది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏఎన్‌టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్‌ల మధ్య జరిగిన చర్చల్లో నిర్ణయించారు. 
 
దీంతో టీడీపీ 2, 5, 16 వార్డుల్లో పోటీ చేయనుంది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు బరిలోకిదిగుతారు. ఈ సందర్భంగా రంగలాల్ మాట్లాడుతూ, పోర్టుబ్లెయిల్ అభివృద్ధికి, ప్రజాస్వామ్యయుత పాలన అందించేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments