Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఐఐటీ-హెచ్ విద్యార్థి...

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (13:00 IST)
విశాఖపట్టణం సముద్రంలో దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని కార్తీక్ (21)గా గుర్తించారు. హైదరాబాద్ - ఐఐటీలో విద్యాభఅయాసం చేస్తున్నాడు. విశాఖ సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి మృతదేహం కేజీహెచ్‌కు తరలించారు. దీంతో కార్తీక్ తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
 
కార్తీక్ గత ఎనిమిది రోజుల నుంచి కనిపించడం లేదనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ ఐఐటీహెచ్‌లో బీటెక్ (మెకానికల్) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 17వ తేదీన ఐఐటీ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో 19వ తేదీన కార్తీక్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విద్యార్థి విశాఖపట్నం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గతవారం రోజులుగా పలు ప్రాంతాల్లో కార్తీక్ ఆచూకీ కోసం పోలీసులు, తల్లిదండ్రులు విస్తృతంగా గాలించారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొ. మూర్తి ఇద్దరు ప్రత్యేక అధికారులను విశాఖపట్నానికి పంపించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం విద్యార్ధి మృతదేహం లభ్యమైంది. దీంతో కార్తీక్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments