Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడో తరగతి బాలికపై అత్యాచారం...

వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ఏడో తరగతి చదివే బాలికపై 27 యేళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మూడు నెలలుగా సాగుతూ వచ్చింది. చివరకు బాలిక తల్లి గుర్తించి నిలదీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (09:42 IST)
వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ఏడో తరగతి చదివే బాలికపై 27 యేళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మూడు నెలలుగా సాగుతూ వచ్చింది. చివరకు బాలిక తల్లి గుర్తించి నిలదీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హన్మకొండలోని తిరుమల బార్‌ సమీపంలో ఓ మహిళ(భర్తకు దూరంగా) తన కూతురు(11)తో కలిసి నివాసం ఉంటూ కూరగాయలు అమ్ముతూ జీవనం గడుపుతోంది. మగదిక్కు లేని ఆ కుంటుంబానికి ఐలయ్య (27) అనే వ్యక్తి దగ్గరయ్యాడు. అతను కూడా కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. 
 
ఈ క్రమంలోనే 7వ తరగతి చదువుతున్న బాలికపై కన్నేసి, ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. తల్లి సమయంలో ఐలయ్య ఇంట్లోకి వెళ్ళి బాలికను అత్యాచారం చేయసాగాడు. ఇలా గత మూడు నెలలుగా చేస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో రాత్రి వేళ బాలికను సదరు వ్యక్తి పక్కకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేయగా, బాలిక తల్లి గమనించి నిలదీసింది. ఈ విషయం బయటకు చెపితే ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. అయితే, ఆ బాలిక తల్లి మాత్రం ఈ బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments