'స్థానిక' ఎన్నికల బాధ్యత మంత్రులదే: జగన్‌

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (07:42 IST)
స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, జిల్లా మంత్రులదేనని సీఎం జగన్‌ పేర్కొన్నట్లు సమాచారం. మంత్రులతో సీఎం జగన్‌ ఆసక్తికర చర్చ జరిపారు. కేబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత జగన్‌ మంత్రులకు పలు సూచనలు చేశారు. 

‘‘స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఓటమి పాలైతే, అందుకు బాధ్యులైన మంత్రులు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి తమ రాజీనామా పత్రాలను గవర్నర్‌కు అందజేయాల్సి  ఉంటుంది. నియోజకవర్గాల పరిధిలో ఓటమికి సంబంధిత శాసనసభ్యులు బాధ్యత వహించాలి.

వారు తమ రాజకీయ భవిష్యత్తును కోల్పోవాల్సిందే. వచ్చే ఎన్నికల్లో వారికి వైసీపీ టికెట్‌ రాదు. పదవులపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు’’ అని జగన్‌ పేర్కొన్నట్లు సమాచారం.

జిల్లాల్లో గ్రూప్‌ తగాదాలను సరిదిద్దాలని మంత్రులకు సూచించారు. మద్యం, డబ్బు పంపిణీ లేకుండా స్థానిక సంస్థలకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం.

మంత్రుల పనితీరుపై తన దగ్గర సర్వే రిపోర్టు ఉందని జగన్‌ చెప్పారు. ఫలితాల్లో తేడా వస్తే రాజీనామా చేయాల్సిందేని జగన్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చేది ఉండదని వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది.

ఈ నెల 8 వరకు కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ నెల 9 నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments