Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి వెలంపల్లికి తీవ్ర అనారోగ్యం.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (08:36 IST)
కరోనా నుంచి కోలుకున్న ఏపీ దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మరోమారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అత్యవసర చికిత్స కోసం ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి అపోలో ఆస్పత్రిలో మంత్రి చికిత్స పొందుతున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.

మంత్రి వెలంపల్లికి కరోనా తిరగబెట్టిందని తెలిసింది. గత నెలలో మంత్రి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళ్లిన సీఎం జగన్‌, సహచర మంత్రులు, వైసీపీ నేతలు, అధికారులతో కలివిడిగా మెలిగారు.

ఆ తర్వాత ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో తిరుమల నుంచి తిరిగొచ్చి విజయవాడలోని ప్రైవేటు ఆస్పతిల్రో వారం రోజులకు పైగా చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక ఈనెల 8న విజయవాడలోని పాఠశాల విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ పంపిణీ చేశారు.

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 17 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 21న మూలానక్షత్రం రోజున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని కోరుతూ 2 రోజుల క్రితమే దుర్గగుడి అధికారులతో కలిసి మంత్రి కూడా సీఎం జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments