Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీకి షాకిచ్చిన సోమిరెడ్డి బావ - కుమారుడు.. ఖిన్నుడైన చంద్రబాబు

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (13:39 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ, కుమారుడు తేరుకోలేని షాకిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. నిన్నటికి నిన్న కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా ఉన్న మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీ‌కు గుడ్‌బై చెప్పి... వైకాపాలో చేరారు. ఈ షాక్ నుంచి టీడీపీ ఇంకా తేరుకోలేదు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వయానా బావ అయిన కేతిరెడ్డి రామకోటారెడ్డి, ఆయన కుమారుడు కేతిరెడ్డి శశిధర్ రెడ్డిలు జగన్ చెంతకు చేరారు. వీరిద్దరూ జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. మంత్రి సోమిరెడ్డి పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తున్న విషయం తెల్సిందే. 
 
హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో గల వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లిన వారిద్దరూ స్వయంగా వైకాపా కండువా కప్పుకున్నారు. ఇప్పటికే అమెరికాలో వైసీపీ తరుపున రామకోటారెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. సోమిరెడ్డి టీడీపీలో సీనియర్ నేత. సీఎం చంద్రబాబుకి సన్నిహితుడు. అలాంటి నేత బంధువులు ప్రతిపక్షంలో చేరడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments