Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థుల కోసం బస్సును ప్రారంభించిన మంత్రి ఆర్కే.రోజా

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (10:16 IST)
విద్యార్థుల కోసం ఏపీ మంత్రి ఆర్కే.రోజా ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో పాటు ఇతర ప్రయాణికులతో కలిసి ఆమె ఆ బస్సులో ప్రయాణించారు. పుత్తూరు మండలంలోని పిల్లరిపట్టు గ్రామానికి సరైన బస్సు సౌకర్యాలు లేక విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మంత్రి రోజా దృష్టికి వచ్చింది. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులను సంప్రదించి స్కూలు సమయంలో విద్యార్థుల కోసం బస్సును నడపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. 
 
దీంతో పిల్లరిపట్టు గ్రామం నుంచి ఆమె బస్సు సర్వీసును ప్రారంభించారు. ఆ తర్వాత బస్సులో విద్యార్థులతో కలిసి ప్రయాణించిన రోజా... వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆ బస్సులో ప్రయాణించిన ఇతర ప్రయాణికులతో పాటు ఆమె ముచ్చటించారు. తమ కోసం బస్సు సర్వీసును ప్రారంభించిన మంత్రి రోజాకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments