Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాడికుండను అప్పగిస్తే అప్పులపాలు చేశారు.. తెలంగాణ మంత్రికి ఏపీ మంత్రి కౌంటర్

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (17:55 IST)
తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. నిధులు లేక ఏపీ.. కేంద్రాన్ని అడుక్కుంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని సీరియిస్ అయ్యారు.
 
నిధుల విషయంలో కేంద్రం వద్ద తాము బిచ్చం ఎత్తుకుంటే… కేసీఆర్ ఏం బిచ్చం ఎత్తుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నారని ఘాటుగా ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో అభివృద్ధి చేసిన హైదరాబాద్ సొమ్మును తెలంగాణ వ్యక్తులు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. పాడికుండను అప్పగిస్తే అప్పులపాలు చేశారని ఆరోపించారు.
 
కేంద్రంపై కోపం ఉంటే ఏపీపై ఏడవటం ఎందుకని పేర్ని నాని ప్ర్రశ్నించారు. ‘మాకు రావాల్సిన నిధుల కోసం కేంద్రం వద్ద బిచ్చం ఎత్తుకుంటున్నాం..మీలా బయట కాలర్ ఎగరేసి లోపల కాళ్లు పట్టుకోము’ అని ఎద్దేవా చేశారు. స్నేహం అంటే స్నేహం..ఢీ అంటే ఢీ జగన్ నైజం అన్నారు. ఇంటిబయట కాలర్ ఎగరేయడం..ఇంట్లోకి వెళ్లి కాళ్లు పట్టుకోవడం అనేది జగన్ తత్వం కాదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments