Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాడికుండను అప్పగిస్తే అప్పులపాలు చేశారు.. తెలంగాణ మంత్రికి ఏపీ మంత్రి కౌంటర్

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (17:55 IST)
తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. నిధులు లేక ఏపీ.. కేంద్రాన్ని అడుక్కుంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని సీరియిస్ అయ్యారు.
 
నిధుల విషయంలో కేంద్రం వద్ద తాము బిచ్చం ఎత్తుకుంటే… కేసీఆర్ ఏం బిచ్చం ఎత్తుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నారని ఘాటుగా ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో అభివృద్ధి చేసిన హైదరాబాద్ సొమ్మును తెలంగాణ వ్యక్తులు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. పాడికుండను అప్పగిస్తే అప్పులపాలు చేశారని ఆరోపించారు.
 
కేంద్రంపై కోపం ఉంటే ఏపీపై ఏడవటం ఎందుకని పేర్ని నాని ప్ర్రశ్నించారు. ‘మాకు రావాల్సిన నిధుల కోసం కేంద్రం వద్ద బిచ్చం ఎత్తుకుంటున్నాం..మీలా బయట కాలర్ ఎగరేసి లోపల కాళ్లు పట్టుకోము’ అని ఎద్దేవా చేశారు. స్నేహం అంటే స్నేహం..ఢీ అంటే ఢీ జగన్ నైజం అన్నారు. ఇంటిబయట కాలర్ ఎగరేయడం..ఇంట్లోకి వెళ్లి కాళ్లు పట్టుకోవడం అనేది జగన్ తత్వం కాదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments