Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధురాలి శవం దగ్గరకు మంత్రి జోగి రమేష్: అయ్యా ఇక్కడేమీ మాట్లాడొద్దంటూ బాధితులు విజ్ఞప్తి

ఐవీఆర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (20:44 IST)
ఏపీ ఎన్నికల నియామవళి అమలులో భాగంగా వాలంటీర్లను విధులకు దూరంగా వుండాలని తెలియజేసిన సంగతి తెలిసిందే. సచివాలయ వాలంటీర్లు అందుబాటులో వుండరు కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటవ తేదీన అందాల్సిన పెన్షన్లు రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం సచివాలయాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయాన్నే డబ్బులు ఇస్తాం రమ్మని చెప్పి బ్యాంకు నుంచి ఇంకా రాలేదని తిప్పి పంపించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
 
ఈరోజు కృష్ణ జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో 80 ఏళ్ల వృద్ధురాలు మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి జోగి రమేష్ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో వైసిపి మద్దతుదారులు... డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినాదాలు చేసారు. పెన్షన్ రానందునే వృద్ధురాలు మరణించిందని ఆరోపించారు.
 
ఐతే మృతురాలి కుటుంబ సభ్యులు వారక్కడ నినాదాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వృద్ధురాలు చనిపోయిన దుఃఖంలో తాము వుంటే ఇక్కడ రాజకీయాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. దయచేసి ఇక్కడేమీ మాట్లాడవద్దనీ, ఏదైనా వుంటే దూరంగా వెళ్లి మాట్లాడుకోమని చెప్పడంతో వైసిపి మద్దతుదార్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments