Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధురాలి శవం దగ్గరకు మంత్రి జోగి రమేష్: అయ్యా ఇక్కడేమీ మాట్లాడొద్దంటూ బాధితులు విజ్ఞప్తి

ఐవీఆర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (20:44 IST)
ఏపీ ఎన్నికల నియామవళి అమలులో భాగంగా వాలంటీర్లను విధులకు దూరంగా వుండాలని తెలియజేసిన సంగతి తెలిసిందే. సచివాలయ వాలంటీర్లు అందుబాటులో వుండరు కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటవ తేదీన అందాల్సిన పెన్షన్లు రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం సచివాలయాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయాన్నే డబ్బులు ఇస్తాం రమ్మని చెప్పి బ్యాంకు నుంచి ఇంకా రాలేదని తిప్పి పంపించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
 
ఈరోజు కృష్ణ జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో 80 ఏళ్ల వృద్ధురాలు మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి జోగి రమేష్ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో వైసిపి మద్దతుదారులు... డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినాదాలు చేసారు. పెన్షన్ రానందునే వృద్ధురాలు మరణించిందని ఆరోపించారు.
 
ఐతే మృతురాలి కుటుంబ సభ్యులు వారక్కడ నినాదాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వృద్ధురాలు చనిపోయిన దుఃఖంలో తాము వుంటే ఇక్కడ రాజకీయాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. దయచేసి ఇక్కడేమీ మాట్లాడవద్దనీ, ఏదైనా వుంటే దూరంగా వెళ్లి మాట్లాడుకోమని చెప్పడంతో వైసిపి మద్దతుదార్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karti: సర్దార్ 2 లో హీరో కార్తి పవర్ ఫుల్ లో కన్పించనున్నాడు

Simbu: నాపై రెడ్ కార్డ్ వేశారు, ఏడ్చాను - థగ్ లైఫ్ చేయనని చెప్పేశాను : శింబు

Rashmika: ట్రాన్స్ ఆఫ్ కుబేర టీజర్ రిలీజ్ - రష్మిక హైలైట్, మరి నాగార్జునకు కలిసివస్తుందా ?

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments