Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధురాలి శవం దగ్గరకు మంత్రి జోగి రమేష్: అయ్యా ఇక్కడేమీ మాట్లాడొద్దంటూ బాధితులు విజ్ఞప్తి

ఐవీఆర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (20:44 IST)
ఏపీ ఎన్నికల నియామవళి అమలులో భాగంగా వాలంటీర్లను విధులకు దూరంగా వుండాలని తెలియజేసిన సంగతి తెలిసిందే. సచివాలయ వాలంటీర్లు అందుబాటులో వుండరు కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటవ తేదీన అందాల్సిన పెన్షన్లు రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం సచివాలయాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయాన్నే డబ్బులు ఇస్తాం రమ్మని చెప్పి బ్యాంకు నుంచి ఇంకా రాలేదని తిప్పి పంపించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
 
ఈరోజు కృష్ణ జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో 80 ఏళ్ల వృద్ధురాలు మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి జోగి రమేష్ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో వైసిపి మద్దతుదారులు... డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినాదాలు చేసారు. పెన్షన్ రానందునే వృద్ధురాలు మరణించిందని ఆరోపించారు.
 
ఐతే మృతురాలి కుటుంబ సభ్యులు వారక్కడ నినాదాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వృద్ధురాలు చనిపోయిన దుఃఖంలో తాము వుంటే ఇక్కడ రాజకీయాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. దయచేసి ఇక్కడేమీ మాట్లాడవద్దనీ, ఏదైనా వుంటే దూరంగా వెళ్లి మాట్లాడుకోమని చెప్పడంతో వైసిపి మద్దతుదార్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments