Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్టచివరి భూముల వరకూ సాగునీరందిస్తాం..: మంత్రి అనిల్ కుమార్

Webdunia
శనివారం, 13 జులై 2019 (06:07 IST)
ఖరీఫ్‌లో రైతులు పంటలు సాగు చేసుకోవడానికి కాలువ చిట్టచివరి భూముల వరకు నీరు అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. సాగు, త్రాగునీటి అవసరాల కోసం కృష్ణాజిల్లాలోని కాలువలకు ప్రకాశం బ్యారేజ్ నుండి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం కె.ఈ. కెనాల్ హెడ్ స్లూయిస్ వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి నీటిని విడుదల చేశారు. 
 
ఈసందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడకపోవడం గోదావరికి వరద కూడా ఆలస్యం కావడంతో కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు. రాబోయే పది రోజుల్లో కృష్ణా పశ్చిమ డెల్టాకు కూడా నీరు విడుదల చేయడం జరుగుతుందన్నారు. 
 
జిల్లా కలెక్టర్ ఎ.ఎం.డి. ఇంతియాజ్ మాట్లాడుతూ గోదావరికి వరద రావడంతో గోదావరి సిస్టంలోని 23 పంపులు ఆన్ చేసి నీరు తీసుకురావడం జరిగిందన్నారు. రెండు రోజుల్లోనే 0.8 టి.యం.సి. నీరు వచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజీకి నీరుచేరగానే సాగునీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకొని కృష్ణా డెల్టా రైతాంగానికి ప్రస్తుతం 1000 క్యూసెక్కుల నీటిని కె.ఇ.బి.కెనాల్‌కు విడుదల చేయడం జరిగిందన్నారు. కృష్ణా డెల్టాకు సుమారు 150 టియంసిల నీరు అవసరం అవుతుందని, 80 టియంసిలు గోదావరి నుండి 60 టియంసిలు పులిచింతల నాగార్జునసాగర్ నుండి మిగిలినవి మునేరు ఇతర నీటి వనరుల నుండి వస్తాయన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments