Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చెన్నాయుడిని బెదిరించిన ఆ ఇద్దరు అరెస్ట్- రూ.80లక్షలతో యాగం చేశారా?

గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు జ్యోతిష్యునికి రూ.80లక్షలు సమర్పించుకున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. గత ఏడాది నవంబరు మాసంలో జ్యోతిష్యుడు కాళిదాసు వర్మ ఆధ్వర్యంలో శ్రీ సౌభాగ

Webdunia
సోమవారం, 15 జనవరి 2018 (15:59 IST)
గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు జ్యోతిష్యునికి రూ.80లక్షలు సమర్పించుకున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. గత ఏడాది నవంబరు మాసంలో జ్యోతిష్యుడు కాళిదాసు వర్మ ఆధ్వర్యంలో శ్రీ సౌభాగ్య విద్యేశ్వరి పంచాయతన యాగాన్ని అచ్చెన్నాయుడు నిర్వహించారని సిక్కోలులో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ యాగాన్ని అచ్చెన్నాయుడు సతీసమేతంగా నిర్వహించారని తెలుస్తోంది. గ్రహస్థితులు బాగాలేవని తెలుసుకున్న మంత్రి.. ఇందుకోసం జ్యోతిష్యుడికి ఏకంగా రూ.80 లక్షలకు పైనే ముట్టజెప్పారన్న ప్రచారం జరుగుతోంది.
 
కానీ పెద్ద మొత్తంలో మంత్రి నుంచి డబ్బులు గుంజాలని పథక రచన చేసిన కాళిదాసు నక్సలైట్ల పేరుతో బెదిరించి, అడ్డంగా బుక్కయ్యాడు. అనుచరుడితో కలిసి మంత్రి ప్రయాణించే మార్గంలో జిలెటిన్ స్టిక్స్ అమర్చి పోలీసులకు చిక్కాడు.

ప్రస్తుతం శర్మతోపాటు అతడి అనుచరుడు కూడా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు. శర్మ అతని అనుచరులు మంత్రి అచ్చెన్నాయుడుకు బెదిరింపు కాల్స్‌ చేశారు. అయితే వీరిని పోలీసులు పక్కా ప్లాన్‌తో అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments