Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్తీమే సవాల్.. రోడ్డుపై కుర్చీలో కూర్చొని వైకాపా రెబెల్ ఎమ్మెల్యే సవాల్

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (19:39 IST)
ఇటీవల వైకాపా నుంచి సస్పెండ్‌కు గురైన నెల్లూరు జిల్లా ఉదయగిరి జిల్లా వైకాపా రెబెల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక వైకాపా నేతలతో పాటు అధిష్టానం నేతలకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. ఉదయగిరి బస్టాండు సెంటరులో రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చొని వైకాపా నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. 
 
పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఉదయగిరికి వస్తే తరిమికొడతామంటూ వైకాపా నేతలు ఆయనకు హెచ్చరికలు పంపారు. దీంతో ఆయన గురువారం ఉదయగిరి బస్టాండ్ సెంటరులో కుర్చీ వేసుకుని కూర్చొని, తనను తరిమి కొడతానన్న వాళ్లు రావాలంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు పెద్దల సంఖ్యలో ఆయన అనుచరులు కూడా అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడి ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. 
 
కాగా, ఇటీవల ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో వైకాపా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీదేవిలపై వైకాపా అధిష్టానం సస్పెండ్ వేటు వేసింది. అప్పటి నుంచి ఉదయగిరి వైకాపా నేతలు మేకపాటిని టార్గెట్ చేశారు. విమర్శలు చెస్తూ నియోజకవర్గంలో అడుగుపెడితే తరిమి కొడతామంటూ హెచ్చరించారు. దీంతో గురువారం ఉదయం ఆయన బస్టాండ్ సెంటర్‌కు వచ్చి బహిరంగ ఛాలెంజ్ విసిరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments