సీఎం జగన్, చిరంజీవి మరోసారి భేటీ.. టాలీవుడ్ సమస్యలపై చర్చ

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (14:33 IST)
మె గాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం మరోసారి భేటీ కానున్నారు. చిరంజీవితో పాటు ఐదుగురు సినీ ప్రముఖులు సీఎంను కలిసే అవకాశం ఉంది. వారంతా ఇండస్ట్రీ సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే టికెట్ల ధరలపై చర్చించనున్నారు.
 
మరోవైపు ఇవాళ (ఫిబ్రవరి 8న) సినీ ప్రముఖులతో చిరంజీవి భేటీ కావాలని భావించినా.. పలువురు ఇండస్ట్రీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో మరోసారి వాయిదా పడింది. ఈ మీటింగ్‌లో సీఎం ముందు ఏ ప్రతిపాదనలు పెట్టాలనే దానిపై చర్చించాలని అనుకున్నారు.
 
ఇండస్ట్రీ సమస్యలపై జనవరి 13న సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఈసారి ఇండస్ట్రీ సభ్యులతో కలిసి సీఎం జగన్‌ను కలుస్తానని చిరంజీవి ఆరోజే ప్రకటించారు. 
 
అందులో భాగంగా ఏపీలో సినిమా టికెట్ల పంచాయితీకి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు మరోసారి ముఖ్యమంత్రితో చర్చించేందుకు… ఇండస్ట్రీ మనోగతాన్ని తెలియచేసేందుకు మెగాస్టార్ చిరంజీవి మరోసారి సమావేశం కానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments