యువజన సర్వీసుల శాఖ నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరం: చదలవాడ నాగరాణి

Webdunia
సోమవారం, 2 మే 2022 (19:29 IST)
రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ నేతృత్వంలో నగరంలోని కేబియన్ కళాశాలలో బుధవారం మెగా రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నామని యువజన సర్వీసుల శాఖ సంచాలకులు చదలవాడ నాగరాణి తెలిపారు. పర్యాటక, సాంస్కృతిక,  యువజనాభివృద్ధి శాఖామాత్యులు ఆర్కే రోజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.

 
ఉదయం 8.30 గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభం కానుండగా యన్టీఆర్, విజయవాడ, గుంటూరు జిల్లాలకు నుండి వివిధ కళాశాలలకు చెందిన యువత, యువజన సంఘాల సభ్యులు, యన్‌సిసి బృందాల నుండి మొత్తం 300 మంది వరకు ఈ కార్యక్రమములో పాల్గొంటారని నాగరాణి తెలిపారు.

 
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా రక్తదాన ఆవశ్యకతను గుర్తించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువజన సర్వీసుల శాఖకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారం అందిస్తున్నాయని, కార్యక్రమంలో భాగంగా అవయవ దానం ఆవశ్యకతను యువతకు తెలియచేసి, వారిని తదనుగుణంగా ముందుకు వచ్చేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. రక్త దాతలు, అవయవ దాతలందరికి ప్రభుత్వ పరంగా ధృవీకరణ పత్రాలు ప్రదానం చేస్తామని, ఆసక్తి ఉన్నవారు శిబిరం వద్ద నేరుగా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని చదలవాడ నాగరాణి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments