లైంగిక వేధింపులు.. తండ్రినే హతమార్చిన కుమార్తెలు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (10:43 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకూతుళ్లపై మద్యం సేవించి లైంగిక వేధింపులకు గురిచేశాడు కసాయి తండ్రి. చివరికి కూతుళ్లే తండ్రిని హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట సీసాలబస్తీలో గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి మాసాని రాజు (50) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి భార్య, కూతుర్లు సౌమ్య( 17), రమ్య (16)లు ఉన్నారు.
 
ఇతను స్థానికంగా పిండి గిర్నిలో పనిచేస్తుండేవాడు. ఇతడి భార్య ఎనిమిది నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుండి మద్యానికి బానిసగా మారి ఇంట్లో ఉన్న ఇద్దరు కుతుళ్లను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. 
 
కానీ మంగళవారం రాత్రి సమయంలో అతిగా మద్యం సేవించి లైంగికంగా వేధించడంతో ఇద్దరు కూతుళ్లు రాజు గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కూతుర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meenakshi: ఎన్.సి.24 చిత్రం నుంచి పరిశోధకరాలిగా మీనాక్షి చౌదరి లుక్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం