Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక వేధింపులు.. తండ్రినే హతమార్చిన కుమార్తెలు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (10:43 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకూతుళ్లపై మద్యం సేవించి లైంగిక వేధింపులకు గురిచేశాడు కసాయి తండ్రి. చివరికి కూతుళ్లే తండ్రిని హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట సీసాలబస్తీలో గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి మాసాని రాజు (50) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి భార్య, కూతుర్లు సౌమ్య( 17), రమ్య (16)లు ఉన్నారు.
 
ఇతను స్థానికంగా పిండి గిర్నిలో పనిచేస్తుండేవాడు. ఇతడి భార్య ఎనిమిది నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుండి మద్యానికి బానిసగా మారి ఇంట్లో ఉన్న ఇద్దరు కుతుళ్లను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. 
 
కానీ మంగళవారం రాత్రి సమయంలో అతిగా మద్యం సేవించి లైంగికంగా వేధించడంతో ఇద్దరు కూతుళ్లు రాజు గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కూతుర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం