Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి జాతీయ రహదారిపై భారీ చోరీ, రూ.80 లక్షల విలువైన ఫోన్లు దోపిడీ

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (18:46 IST)
గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిపై భారీగా చోరీ జరిగింది. ఓ కంటెయినర్ నుంచి రూ.80 లక్షల  విలువగల మొబైల్ పోన్లను దుండుగలు చోరీ చేశారు. ఇందులో 980 మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్ నుంచి కొల్ కత్తాకు మొబైల్ ఫోన్లను కంటెయినర్లో తరలిస్తున్నారు.
 
ఆ కంటెయినర్ మంగళగిరి సమీపంలోకి వచ్చిన సమయంలో ఓ వాహనదారుడు కంటెయినర్ వెనుక భాగం తెరిచి ఉన్నట్లు గుర్తించాడు. ఆ విషయాన్ని కంటెయినర్ డ్రైవర్‌కు తెలిపాడు. దాంతో వాహనన్ని ఆపిన డ్రైవర్ వెనుక భాగంలో పరిశీలించగా అందులో చోరీ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాజా టోల్‌గేట్ వద్ద కంటెయినర్‌ను నిలిపి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి ఈ ఘటనపై వెంటనే స్పందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా ఈ ఘటనకు పాల్పడి ఉంటుందని తెలిపారు. ఇదే తరహా కొన్ని వారాల క్రితం చిత్తూరు జిల్లాలో కంటైనర్ నుంచి మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. వాటి విలువ రూ.10 కోట్లు అని తెలిసింది.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments