Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరుకున్న ప్రేయసితో పెళ్లైంది.. భార్యకు జలుబు చేసిందని మందులు కొనేందుకు వెళ్తే..?

Webdunia
శనివారం, 11 మే 2019 (14:46 IST)
రెండేళ్లు ప్రేమించాడు.. రెండు రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఇంతలోనే విధి వక్రించింది. రైలు ప్రమాదంలో కొత్త పెళ్లి కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పచ్చని పందరితో వున్న ఆ ఇంట శోకసంద్రంలో మునిగిపోయింది.


ఇక కోరుకున్న ప్రేమికుడితో వివాహం జరిగిందనే సంతోషం ఆ వధువుకు రెండు రోజులు కూడా నిలవలేదు. కాళ్ల పారాణి ఆరకముందే వధువుకు తీరని దుఃఖం మిగిలిపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. దేవునిపల్లి గ్రామానికి చెందిన కిశోర్‌‌కు తను ప్రేమించిన అమ్మాయితో రెండు రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ సమయంలో భార్యకు జలుబు చేసింది. దీంతో ఆమెకు మందులు తీసుకరావడం కోసం బయటకు వచ్చాడు. 
 
ఈ క్రమంలో ఏదో ఆలోచిస్తూ సమీపంలో ఉన్న రైలు పట్టాలు దాటుతున్న సమయంలో కాచిగూడ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న డెమో ప్యాసింజర్‌ వేగంగా ఢీ కొట్టింది.

దీంతో తీవ్ర గాయాలైన కిశోర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. కుమారుడి ప్రమాద వార్త తెలుసుకుని అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు, భార్య విలపించిన తీరు అక్కడి ఉన్నవారిని కలిచివేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharanya: ఫిదా భామ శరణ్యకు సన్నగిల్లిన అవకాశాలు.. కానీ ఈ ఏడాది ఛాన్సులే ఛాన్సులు

ప్రేమ, ప్రతీకారం, మోసంతో అడివి శేష్ డకాయిట్ ఫైర్ గ్లింప్స్ రిలీజ్

Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీ కాయదు పార్టీ వ్యవహారం- ఒక్క రాత్రికి రూ.30 లక్షలు.. అవి కంపల్సరీ

మిరాయ్ కోసం రైలు పైన నిలబడి రిస్కీ స్టంట్ చేసిన తేజ సజ్జా

షష్టిపూర్తి లోని రాజేంద్ర ప్రసాద్ పాత్ర బయట కనిపించదు : దర్శకుడు పవన్ ప్రభ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా

రిలేషన్‌షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

తర్వాతి కథనం
Show comments