Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏజెన్సీలో కారును తగలబెట్టిన మావోయిస్టులు (Video)

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో జాతీయ రహదారిపై వెళుతున్న అడ్డగించి, అందులోని ప్రయాణికులను కిందకు దించేసిన మావోయిస్టులు.. ఆ తర్వాత కారుకు నిప్పుపెట్టి తగలబెట్టేశారు. కారులో ఉన్న ప్రయాణికులను దింపి అనంతరం కారుకు నిప్పుపెట్టారు. 
 
ఈ నెల 2 నుంచి 9 వరకు మావోయిస్టుల వారోత్సవాలకు పిలుపునిచ్చి, విజయవంతంగా నిర్వహించిన విషయం తెల్సిందే. అయితే, ఈ వారోత్సవాలు ముగిసిన మరుసటి రోజే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. 
 
అయితే, దగ్ధమైన కారు ఎటు నుంచి బయలుదేరింది. ఎంత మంది వ్యక్తులు అందులో ప్రయాణించారు అనే సమాచారం తెలియరాలేదు. ఈ ఘటన చింతూరు వైపు నుంచి భద్రాచలం వెళ్లే రహదారి మధ్యలో సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో జరిగినట్టు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కడా చోటుచేసుకోలేదు. ఇపుడు మళ్లీ జరగడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగాలు చేస్తున్న అభిమాన దర్శకులు

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments