Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏజెన్సీలో కారును తగలబెట్టిన మావోయిస్టులు (Video)

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో జాతీయ రహదారిపై వెళుతున్న అడ్డగించి, అందులోని ప్రయాణికులను కిందకు దించేసిన మావోయిస్టులు.. ఆ తర్వాత కారుకు నిప్పుపెట్టి తగలబెట్టేశారు. కారులో ఉన్న ప్రయాణికులను దింపి అనంతరం కారుకు నిప్పుపెట్టారు. 
 
ఈ నెల 2 నుంచి 9 వరకు మావోయిస్టుల వారోత్సవాలకు పిలుపునిచ్చి, విజయవంతంగా నిర్వహించిన విషయం తెల్సిందే. అయితే, ఈ వారోత్సవాలు ముగిసిన మరుసటి రోజే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. 
 
అయితే, దగ్ధమైన కారు ఎటు నుంచి బయలుదేరింది. ఎంత మంది వ్యక్తులు అందులో ప్రయాణించారు అనే సమాచారం తెలియరాలేదు. ఈ ఘటన చింతూరు వైపు నుంచి భద్రాచలం వెళ్లే రహదారి మధ్యలో సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో జరిగినట్టు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కడా చోటుచేసుకోలేదు. ఇపుడు మళ్లీ జరగడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments