Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం చంద్ర‌బాబు, నారా లోకేష్‌కు మావోయిస్టుల బెదిరింపు లేఖ‌... ఆత్మాహుతి దాడి చేస్తాం...

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దులో భారీ ఎన్‌కౌంట‌ర్‌ను ఖండిస్తూ, ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు తేనె పూసిన కత్తి అని, ఆయన ఇంతకింత ఫలితం అనుభవించి తీరుతారని మావో

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (19:17 IST)
హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దులో భారీ ఎన్‌కౌంట‌ర్‌ను ఖండిస్తూ, ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు తేనె పూసిన కత్తి అని, ఆయన ఇంతకింత ఫలితం అనుభవించి తీరుతారని మావోయిస్టు ఏపీ అధికార ప్రతినిధి శ్యామ్ తన లేఖలో పేర్కొన్నారు. 
 
ఏఓబీలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని ఆయన మండిపడ్డారు. భోజనంలో విషం పెట్టి చంపారని ఆరోపించారు. చంద్రబాబు ఇంతకింత ఫలితాన్ని అనుభవిస్తారనీ, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ బాబులపై అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. పోలీసు అధికారులను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అగ్ర నాయకత్వాన్ని మట్టుబెట్టాలన్న ప్రణాళికతోనే ఈ ఎన్ కౌంటర్ చేశారనీ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల కుట్ర ఫలితంగానే ఏఓబీ ఎన్‌కౌంటర్ జరిగిందని అన్నారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments