Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ఉచిత ఆఫర్‌తో ఎయిర్‌టెల్ బెంబేలు... జీవితాంతం ఏదీ ఉచితంగా ఇవ్వకూడదు... ట్రాయ్‌కు విజ్ఞప్తి

మాట్లాడు ఇండియా మాట్లాడు అనే నినాదం ఇప్పుడు వర్కవుట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ తో దేశంలో ప్రతి మూలనున్నవారు సైతం జియో సిమ్ కోసం పరుగులు తీస్తున్నారు. ఆ తర్వాత ఎంత ఆనందం... ఇష్టమొచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు... ఇష్టమొచ్చినంతసేప

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (18:28 IST)
మాట్లాడు ఇండియా మాట్లాడు అనే నినాదం ఇప్పుడు వర్కవుట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ తో దేశంలో ప్రతి మూలనున్నవారు సైతం జియో సిమ్ కోసం పరుగులు తీస్తున్నారు. ఆ తర్వాత ఎంత ఆనందం... ఇష్టమొచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు... ఇష్టమొచ్చినంతసేపు సమాచారాన్ని చూడవచ్చు. చాలా హ్యాపీగా ఉందంటున్నారు జియో కస్టమర్స్. 
 
ఇదీ చదవండి: కొత్త జియో పెద్ద కంపెనీలతో ర్యాగింగ్ చేయబడుతోంది: ముఖేష్ అంబానీ ఆవేదన
 
ఐతే జియో దెబ్బకు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా కుదేలవుతున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా జియో ఇచ్చిన ఆఫర్ల పైన మండిపడుతున్నాయి. తాజాగా భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ బుధవారం నాడు మాట్లాడుతూ... జీవితాంతం దేన్నీ ఉచితంగా ఇవ్వకూడదంటూ జియో ఉచిత వాయిస్ కాల్స్ గురించి ప్రస్తావించారు. జియో ఉచిత ఆఫర్లపైన ట్రాయ్ మరొక్కసారి పరిశీలించాలంటూ విజ్ఞప్తి చేశారు. కాగా గతంలో ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా కంపెనీలు ట్రాయ్ కు చేసిన ఫిర్యాదులను తోసిపుచ్చడమే కాకుండా ఆ కంపెనీలకు రూ. 3050 కోట్లు జరిమానా విధించింది. 
 
చూడండి జియో టారిఫ్ ప్లాన్... ఏ ప్లానైనా ఉచితంగా వాయిస్ కాల్స్...
 
దీనితో రిలయన్స్ జియో దెబ్బకు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా టెలికాం సంస్థలు మూలుగుతున్నాయి. జియో దెబ్బకు కోట్లలో నష్టాలను చవిచూస్తున్నాయి. అసలే నష్టాలతో మూలుగుతున్న ఈ కంపెనీలపై ట్రాయ్ కొరడా ఝుళిపించింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు మొబైల్‌ లైసెన్స్‌ నిబంధనలను సంస్థలు ఉల్లంఘించడాన్ని ట్రాయ్‌(టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) తప్పుబడుతూ ఏకంగా రూ. 3050 కోట్లు జరిమానా విధించింది. 
 
ఇది కూడా చూడండి: ఆన్‌లైన్‌లో Jio సిమ్ కొనేముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి
 
ఈ మేరకు తన సిఫారసులను టెలికాం శాఖకు సిఫారసు చేసింది. ఆ సిఫారసుల ప్రకారం అత్యధికంగా వొడాఫోన్ పైన రూ. 1050 కోట్లు, ఐడియా పైన రూ. 950 కోట్లు, ఎయిర్ టైల్ పైన రూ.50 కోట్ల చొప్పున జరిమానా విధించింది. జియో కాల్స్ కనెక్ట్ ఇవ్వడంలో ఈ కంపెనీలు మొండికేస్తున్నాయనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే.
 
ఇదికూడా చదవండి: రిలయన్స్ జియో వరల్డ్ రికార్డు... నెలలో 1.60 కోట్ల మంది కస్టమర్లు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments