Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ సంప్రదాయాలు పాటించే వ్యక్తి

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (12:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సాధారణంగా ఉంటూ, సంప్రదాయాలకు విలువ ఇచ్చే వ్యక్తి అని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామి చెప్పారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి దంపతులు, అదనపు ఈవో ధర్మారెడ్డి దంపతులు మంగళవారం తిరుమలలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించి స్వామి వారి పూజలో పాల్గొన్నారు. అనంతరం వీరు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామివారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా సుబుదేంద్ర తీర్థ స్వామి మాట్లాడుతూ, రాఘవేంద్రస్వామివారి కుల దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. స్వామివారి ఆదేశంతో తిరుమలకు వచ్చి శ్రీ వేంకటేశ్వర కన్నడ భక్తి ఛానల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం స్వామివారి దయతోనే జరిగిందన్నారు. కార్యక్రమం చాలా బాగా, సంప్రదాయ బద్దంగా నిర్వహించారని టీటీడీని సుబుదేంద్ర తీర్థ స్వామి అభినందించారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments