Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరిలో జనసేన పీఏసీ సమావేశం... కీలక తీర్మానాలు ఆమోదం

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (17:46 IST)
మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇందులో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసు, అధికార వ్యవస్థను దుర్వినియోగం చేసి భయానక వాతావరణం సృష్టించిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. 
 
కేంద్ర మంత్రి మురళీధరన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, సీపీఐ నారాయణ, సీపీఐ రామకృష్ణ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, బీజీపీ చీఫ్ సోము వీర్రాజు, లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్, బాబ్జిలు ఈ చర్యను ఖండించారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి సమాజంలో తీర్మానం చేశారు. 
 
వైకాపా తొత్తులుగా మారిన పోలీసులు జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు వీర మహిళలపై అక్రమ కేసులు పెట్టారని, వారి కుటుం సభ్యుల్లో మనోధైర్యాన్ని నింపిన పార్టీ అధినేత పవన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోతీర్మానం చేశారు. అక్రమ కేసులను ఎదుర్కొంటున్న వారికి న్యాయపరమైన సహాయం అందించిన పార్టీ న్యాయ విభాగం సభ్యులను, న్యాయవాదులను అభినందిస్తూ తీర్మానం చేసినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments