Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్‌ సిగ్నల్స్ మంచి పనిచేశాయ్.. ప్రాణాపాయం తప్పింది..

Webdunia
సోమవారం, 12 జులై 2021 (10:33 IST)
ఫోన్‌సిగ్నల్స్‌ ఆధారంగా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన పెదవాల్తేరులో జరిగింది. ఆత్మహత్యకు యత్నించిన ఉద్యోగి ఫోన్‌ సిగ్నల్స్ ఆధారంగా అతని ప్రాణాలు కాపాడినట్లు పోలీసులు తెలిపారు. సి.ఐ. కె.ఈశ్వరరావు అందించిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.చైతన్యవర్మ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శనివారం సాయంత్రం 6 గంటలకు అతని స్నేహితుడు అనకాపల్లి పోలీసులకు సమాచారమిచ్చాడు. అనకాపల్లి పోలీసులు ఆ సెల్‌ఫోన్‌ ఏరియాను ట్రేస్‌ చేయగా.. విశాఖ రామ్‌నగర్‌లో ఉన్నట్లు తెలిసింది. 
 
అనకాపల్లి పోలీసులు విశాఖ మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై రాము ఆధ్వర్యంలో సిబ్బంది సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను గుర్తిస్తూ రామ్‌నగర్‌లోని పలు హోటళ్లలో గాలించారు. 8.20 గంటల సమయంలో చైతన్యవర్మ ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. అప్పటికే అతను అపస్మారక స్థితికి చేరుకున్నట్లు తెలిపారు. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ కేసును విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments