Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్‌ సిగ్నల్స్ మంచి పనిచేశాయ్.. ప్రాణాపాయం తప్పింది..

Webdunia
సోమవారం, 12 జులై 2021 (10:33 IST)
ఫోన్‌సిగ్నల్స్‌ ఆధారంగా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన పెదవాల్తేరులో జరిగింది. ఆత్మహత్యకు యత్నించిన ఉద్యోగి ఫోన్‌ సిగ్నల్స్ ఆధారంగా అతని ప్రాణాలు కాపాడినట్లు పోలీసులు తెలిపారు. సి.ఐ. కె.ఈశ్వరరావు అందించిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.చైతన్యవర్మ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శనివారం సాయంత్రం 6 గంటలకు అతని స్నేహితుడు అనకాపల్లి పోలీసులకు సమాచారమిచ్చాడు. అనకాపల్లి పోలీసులు ఆ సెల్‌ఫోన్‌ ఏరియాను ట్రేస్‌ చేయగా.. విశాఖ రామ్‌నగర్‌లో ఉన్నట్లు తెలిసింది. 
 
అనకాపల్లి పోలీసులు విశాఖ మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై రాము ఆధ్వర్యంలో సిబ్బంది సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను గుర్తిస్తూ రామ్‌నగర్‌లోని పలు హోటళ్లలో గాలించారు. 8.20 గంటల సమయంలో చైతన్యవర్మ ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. అప్పటికే అతను అపస్మారక స్థితికి చేరుకున్నట్లు తెలిపారు. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ కేసును విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వసలు తెలుగేనా? నీ యాక్సెంట్ తేడాగా వుంది: మంచు లక్ష్మికి అల్లు అర్హ షాక్ (video)

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments