Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో మంటలు.. డ్రైవర్ సజీవదహనం

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:20 IST)
బాహ్యవలయ రహదారి (ఔటర్ రింగ్ రోడ్డు)పై వెళుతుండగా కార్‌లో మంటలు రేగడంతో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ బాహ్యవలయ రహదారిపై ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
బొల్లారం వైపు నుంచి ముత్తంగి వైపు వెళుతున్న టీఎస్‌ 07 జీఎం 4666 నంబర్ గల కారు రోడ్డుపై దగ్దం అవుతుండటంతో హుటాహుటిన అగ్ని మాపకసిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తి పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించారు. 
 
మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. మంటలు అంటుకోవడానికి గల కారణం కూడా బోధపడలేదని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివారాలు తెలుసుకున్న తర్వాత సంబంధికులకు సమాచారం అందిస్తామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments