Webdunia - Bharat's app for daily news and videos

Install App

టికెట్ లేకుండా యువకుడి రైలు ప్రయాణం.. ఫైన్ కట్టాల్సింది పోయి.. ప్రాణాలు?

టికెట్ లేకుండా రైలులో ప్రయాణించిన పాపానికి ఓ యువకుడు ఫైన్ కట్టాల్సింది పోయి.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. రైల్వే టీసీ ఓవరాక్షన్ చేయడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివర

Webdunia
శనివారం, 15 సెప్టెంబరు 2018 (14:08 IST)
టికెట్ లేకుండా రైలులో ప్రయాణించిన పాపానికి ఓ యువకుడు ఫైన్ కట్టాల్సింది పోయి.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. రైల్వే టీసీ ఓవరాక్షన్ చేయడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. తాండూరు నాంపల్లి ప్యాసింజర్ ట్రైన్‌లో.. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న యువకుడ్ని పట్టుకునేందుకు టీసీ ప్రయత్నించాడు. 
 
టీసీకి భయపడి ఆ యువకుడు దూకేయడంతో రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. గొల్లపూడి స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన అనంతరం టికెట్‌ కలెక్టర్‌ను ప్రయాణికులు చితకబాదారు. మృతున్ని వికారాబాద్‌ పరిధి అనంతగిరిపల్లి తండా వాసి కాట్రావత్‌ శివగా గుర్తించారు.
 
రైలులో టికెట్ లేకుండా ప్రయాణించిన యువకుడు టీటీఈని గమనించిన తర్వాత ట్రైన్ నుంచి దూకేయబోగా ఆ అధికారి అతని కాలర్ పట్టుకున్నాడు. దీంతో అదుపు తప్పిన యువకుడు రైలు పట్టాలపై పడిపోయాడు. అతనిపై నుంచి రైలు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని తోటి ప్రయాణీకులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments