Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపాకి రాజీనామా చేసి వైకాపాలోకి మాగుంట...

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (18:39 IST)
పురుషులందు పుణ్య పురుషులు వేరయా... అన్నట్లు... పార్టీకి రాజీనామా చేసి వెళ్లే వాళ్లందరూ తిడ్తూనే వెళ్లక్కర్లేదని నిరూపించారు తాజాగా తెదేపాకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. తెదేపాకి రాజీనామా చేసిన అనంతరం తన అనుచరులతో సమావేశమైన తర్వాత వైకాపాలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. వైఎస్‌తో ఉన్న అనుబంధంతోనే వైకాపాలో చేరుతున్నానని మాగుంట చెప్పారు. 
 
చంద్రబాబుతో 37 ఏళ్ల అనుబంధం ఉందనీ, పార్టీలో చంద్రబాబు అన్ని రకాలుగా సహకరించారని మాగుంట వ్యాఖ్యానించారు. ఎంపీగా ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని మాగుంట శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబును కొనియాడారు.
 
అయితే.. పార్టీని వీడిపోతున్న నేతలందరూ సదరు పార్టీ అధినేతలపై, పార్టీపై విమర్శలు చేసి మరీ వెళుతుంటే మాగుంట మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. చంద్రబాబు తనకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి మాగుంట ప్రశంసించడంతో వైకాపాని షాక్‌కి గురి చేస్తోంది. వైసీపీకి మాగుంట వ్యాఖ్యలు మింగుడు పడని పరిస్థితి కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments