Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు ఇచ్చే లంచాలతోనే మంత్రులకు సౌకర్యాలు : మడకసిర తాహసీల్దార్ వీడియో వైరల్

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2023 (10:20 IST)
రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు తమ ప్రాంతాల పర్యటనకు వచ్చినపుడు వారికి ఏర్పాట్లతో పాటు సకల సౌకర్యాలను ప్రజలిచ్చే లంచాలతోనే సమకూర్చుతున్నామని శ్రీ సత్యనాయి జిల్లా మడకశిర తాహసీల్దారు ముర్దావలీ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ రైతుతో మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మడకశిర మండలం మెళవాయి గ్రామ పరిధి సర్వే నంబరు 441-1లో అదే ఊరికి చెందిన రైతు విశ్వనాథ్ గుప్తాకు 90 సెంట్ల భూమి ఉంది. అందులో 17 సెంట్లను పక్క పొలం రైతుకు ఓ రెవెన్యూ అధికారి లంచం తీసుకుని, రాసిచ్చాడని రైతు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో దానిని సరిచేసి తన భూమి తనకు చెందేలా తహసీల్దార్ ముర్షావలి చేసి న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం గత ఆరు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో రైతు శనివారం తహసీల్దార్ ముర్షావలి చాంబర్‌లోకి వెళ్లి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. దీంతో తహసీల్దార్ ముర్షావలి రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చినపుడు మేం ఖర్చులు భరించాల్సి వస్తోంది. మడకశిరకు ఆరు నెలల క్రితం ఓ మంత్రి వచ్చినప్పుడు రూ.1.70 లక్షలు ఖర్చయింది. ఆ మొత్తం నలుగురు వీఆర్వోలు భరించారు. 
 
ఇటీవల కేంద్ర జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మడకశిర వచ్చినపుడు అన్ని ఖర్చులూ తామే భరించామన్నారు. ఆ సెక్రటరీ మెనూలో బిర్యానీలు, స్టార్టర్లు, ఐస్క్రీంలు, డ్రై ఫ్రూట్స్‌తో పాటు పాన్ దోస కూడా ఉందని తన ఫోనులోని జాబితా చూపారు. పాన్ దోస బెంగళూరు నుంచి తెప్పించాల్సి వచ్చిందని వాపోయారు. ఈ ఖర్చులన్నీ తమ జీతాల నుంచి ఇచ్చుకోవాలా అంటూ మండిపడ్డారు. ఇన్ని ఖర్చులు భరించుకోవాలి కాబట్టే లంచాలు తీసుకుంటున్నామంటూ రైతుకు తహసీల్దార్ వివరించారు. ఈ సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తీవ్రంగా స్పందించారు. తహసీల్దారు ముర్షావలిని సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments