మ‌చిలీప‌ట్నం బెల్ కంపెనీ... దేశ రక్షణ పరికరాల ప్రదర్శన

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (16:06 IST)
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే గర్వకారణం అని, దేశ రక్షణ, భద్రతలో భారత్ ఎలక్ట్రానిక్స్ కు ప్రత్యేక స్థానం ఉంద‌ని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని అన్నారు. మ‌చిలీప‌ట్నంలో శనివారం స్థానిక భారత్ ఎలక్ట్రానిక్స్ ను మంత్రి పేర్నినాని సందర్శించారు. 
 
 
ఆజాదీకా మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈనెల 13 నుండి  19వ తేదీ వరకు భారత్ ఎలక్ట్రానిక్స్ లో తయారయ్యే దేశ రక్షణ పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల, కళాశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. భారత్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసిన పరికరాల‌ను, యుద్ధంలో వాడినప్పుడు సైనికులు  పొందే అనుభూతి వాటిని చూసినప్పుడు విద్యార్థులు కూడా గొప్ప అనుభూతి పొందగలరని మంత్రి అన్నారు. దేశ రక్షణకు వాడే పరికరాలు మచిలీపట్నంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లో తయారు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ జనరల్ మేనేజర్ బి ప్రభాకర్ రావు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments