Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం

Webdunia
ఆదివారం, 31 మే 2020 (17:56 IST)
ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవులు ప్రాంతాలలో ఆదివారం(మే 31వ తేదీన) ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 24 గంటలలో తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో తుఫానుగా మారే అవకాశం ఉంది. తర్వాత ఇది ఉత్తర దిశగా ప్రయాణించి జూన్ 3వ తేదీకల్లా ఉత్తర మహారాష్ట్ర మరియు గుజరాత్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. 
 
రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని  ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీన కేరళ రాష్ట్రంలోనికి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.
 
ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవులు వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మరియు కేరళ మీదుగా 0.9 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, ఎల్లుండి కొన్నిచోట్ల, రేపు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడురోజులు ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments