Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బలపడిన వాయుగుండం - ఆంధ్రాను తాకనున్న యాంపిన్

బలపడిన వాయుగుండం - ఆంధ్రాను తాకనున్న యాంపిన్
, శుక్రవారం, 15 మే 2020 (11:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచివుంది. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం మరితంగా బలపడింది. ఇది శుక్రవారం వాయుగుండంగా మారి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుండగా, దీనికి వాతావరణ శాఖ 'యాంపిన్' అని పేరు పెట్టారు. 
 
శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయానికి ఇది తుఫానుగా రూపాంతరం చెందనుంది. ఆపై తొలుత వాయవ్య దిశలో, ఆపై ఉత్తర ఈశాన్య దిశలో పయనించి పెను తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 
 
కాగా, ఇప్పటికే ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, దీనికి యాంపిన్‌తోడు కానుందని 16 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. 
 
17వ తేదీన తీరం వెంబడి 80 కిలోమీటర్ల వరకూ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, 18న గాలుల తీవ్రత అధికమవుతుందని హెచ్చరించారు. ఇంకోవైపు శుక్రవారం రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
 
కాగా, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా, మామిడి, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ అకాల వర్షం నుంచి తేరుకోకముందే ఇపుడు తుఫాను    

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతన్నలకు క్రెడిట్ కార్డులు- రూ .1.60 లక్షలకు పెరిగిన పరిమితి..!