Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి వర్ష సూచన

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (08:09 IST)
ఒకవైపు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరోవైపు, దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ రెండింటి ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ఈ నెల 30వ తేదీ వరకు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయని వివరించింది. శుక్ర, శనివారాల్లో విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. 
 
మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, ఇటీవల తెలంగాణా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments