Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించుకున్నారు... పెళ్లికి పెద్దలు ససేమిరా అన్నారు.. రైలు కిందపడి ఆత్మహత్య

ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలతో చెప్పారు. కానీ పెద్దలు ససేమిరా అన్నారు. చివరికి ఆ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (14:35 IST)
ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలతో చెప్పారు. కానీ పెద్దలు ససేమిరా అన్నారు. చివరికి ఆ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన కరణం సందీప్‌ (22), గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరుకు చెందిన గోగిరెడ్డి మౌనిక (21)లు ప్రేమికులు. 
 
ఇద్దరూ ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని.. చీరాల రైల్వే స్టేషన్లో కలుసుకున్నారు. ఆపై విజయవాడకు వెళ్లి వివాహం చేసుకున్నారు. అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా వారు సానుకూలంగా స్పందించకపోవడంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామనే విషయాన్ని తిమ్మసముద్రంలోని తన మిత్రుడు సందీప్‌కు మెసేజ్ పెట్టారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments