Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుల జంట కన్నుమూత.. ప్రియుడు ఇక లేడని.. విషం తాగి ప్రియురాలు..?

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (12:34 IST)
గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఓ ప్రోమోన్మాది చేతిలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. తాజాగా అదే గుంటూరు జిల్లాలో ప్రేమికుల జంట కన్నుమూసింది.

గుంటూరు జిల్లా ఉండ్రాళ్ల మండలం యల్లాయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రియుడు ప్రమాదవశాత్తు మరణించగా, ఆ బాధ భరించలేక ప్రియురాలు విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్ (21), సౌమ్య (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయించుకోగా, కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు.
 
సాధారణంగా యువతీయువకుల్లో ప్రేమను ఇరుకుటుంబాల వారూ అంగీకరించడం చాలా అరుదైన విషయం. దాంతో తమ ప్రేమ పండిందని శ్రీకాంత్, సౌమ్య సంబరపడిపోయారు. అయితే, ఓ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డెకరేషన్ కోసం వెళ్లిన శ్రీకాంత్ విద్యుదాఘాతంతో మరణించాడు. దాంతో సౌమ్యకు గుండె పగిలినట్టయింది. ప్రియుడి మృతిని జీర్ణించుకోలేక ఆమె విష గుళికలు మింగింది.
 
ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు విడిచింది. దాంతో వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరినీ ఒకే చోట ఖననం చేశారు. ప్రేమికులు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments