Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయంలో కొలువుదీరిన మట్టి గణపతి...

అమరావతి : భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉంది. పండగుల వెనుకున్న పరామర్థం కూడా అదేనని భావిస్తూ... ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఫలహారశాల అసోసియేషన్ మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి చవితి ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది.

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (20:29 IST)
అమరావతి : భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉంది. పండగుల వెనుకున్న పరామర్థం కూడా అదేనని భావిస్తూ... ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఫలహారశాల అసోసియేషన్ మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి చవితి ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. సచివాలయంలోని మూడో బ్లాక్ క్యాంటీన్లో వినాయక చవితి వేడుకలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.
 
అయిదు అడుగుల మట్టి గణపతిని ప్రతిష్టించి, శాస్త్రోక్తంగా భక్తిప్రపత్తులతో పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఫలహార శాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వేడుకలు ఈ నెల 19వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు వంకాయల శ్రీనివాసరావు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కేవీఎల్ కాళీకుమార్, ట్రెజరర్ కొండారెడ్డి, ప్రతాప్ రెడ్డి, వరాలు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments