Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్యాలగూడ పరువు హత్య... నిందితుల ఆచూకి చెప్పినవారికి పారితోషికం...

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం ఉదయం స్థానిక జ్యోతి ఆసుపత్రి వద్ద అత్యంత కిరాతకంగా హత్య చేయబడిన ప్రణవ్ కేసులో పరారీలో ఉన్న ఏ-1 నిందితుడు తిరునగరు మారుతీ రావు, ఏ-2 నిందితుడు శ్రవణ్‌ల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి ఆచూకి తెలిసిన

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (19:26 IST)
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం ఉదయం స్థానిక జ్యోతి ఆసుపత్రి వద్ద అత్యంత కిరాతకంగా హత్య చేయబడిన ప్రణవ్ కేసులో పరారీలో ఉన్న ఏ-1 నిందితుడు తిరునగరు మారుతీ రావు, ఏ-2 నిందితుడు శ్రవణ్‌ల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి ఆచూకి తెలిసిన వారు నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్, సెల్ : 94407 95600/ డి.ఎస్.పి. మిర్యాలగూడ శ్రీనివాస్, సెల్ : 94407 95636 నెంబర్లకు సమాచారం ఇవ్వలసిందిగా జిల్లా ఎస్పీ రంగనాధ్ కోరారు. 
 
ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం పోలీస్ శాఖ తరపున అందచేస్తామని ఆయన తెలిపారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని చెప్పారు. మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ఈ పరువు హత్యకు సంబంధించి నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు. నిందితుల ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments