Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ చట్టంలో లొసుగులు: ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (06:02 IST)
దేశంలో మహిళలకు స్వాతంత్య్రం రాలేదని రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. తాడేపల్లిగూడెంలో ఒక ప్రైవేటు పాఠశాలలో దిశ చట్టంపై విద్యార్థులు నిర్వహించిన అభినందన సభలో ఆమె మాట్లాడారు.

దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా 30 లక్షల నేరాలు నమోదవుతుంటే రాష్ట్రంలో 1.50 లక్షల నేరాలు ఉన్నాయని తెలిపారు. అందులో ప్రతీ ఏటా మన దేశంలో 15 వేల కేసులు మహిళలకు సంబంధించి నమోదు కావడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు.  మహిళలపై అకృత్యాలు జరిగే దేశాల్లో మన దేశం ప్రథమ స్థానంలో ఉండడం సిగ్గు చేటని ఆవేదన వెలిబుచ్చారు.

నిర్భయ ఘటనతో కేంద్రంలో చట్టం చేసినప్పటికీ.. అందులో లొసుగుల కారణంగా నేరస్థులను జైలులో మేపుతున్నారని మండిపడ్డారు. మహిళా రక్షణకే దిశ చట్టం తెచ్చామన్నారు. ప్రతి పాఠశాలలోనూ మహిళలకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించేలా బోర్డులు పెట్టాలని సూచించారు.

మహిళలకు ఆపద వస్తే 100, 1012, 181 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. అనంతరం హోం మంత్రిని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సత్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments