Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ చట్టంలో లొసుగులు: ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (06:02 IST)
దేశంలో మహిళలకు స్వాతంత్య్రం రాలేదని రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. తాడేపల్లిగూడెంలో ఒక ప్రైవేటు పాఠశాలలో దిశ చట్టంపై విద్యార్థులు నిర్వహించిన అభినందన సభలో ఆమె మాట్లాడారు.

దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా 30 లక్షల నేరాలు నమోదవుతుంటే రాష్ట్రంలో 1.50 లక్షల నేరాలు ఉన్నాయని తెలిపారు. అందులో ప్రతీ ఏటా మన దేశంలో 15 వేల కేసులు మహిళలకు సంబంధించి నమోదు కావడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు.  మహిళలపై అకృత్యాలు జరిగే దేశాల్లో మన దేశం ప్రథమ స్థానంలో ఉండడం సిగ్గు చేటని ఆవేదన వెలిబుచ్చారు.

నిర్భయ ఘటనతో కేంద్రంలో చట్టం చేసినప్పటికీ.. అందులో లొసుగుల కారణంగా నేరస్థులను జైలులో మేపుతున్నారని మండిపడ్డారు. మహిళా రక్షణకే దిశ చట్టం తెచ్చామన్నారు. ప్రతి పాఠశాలలోనూ మహిళలకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించేలా బోర్డులు పెట్టాలని సూచించారు.

మహిళలకు ఆపద వస్తే 100, 1012, 181 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. అనంతరం హోం మంత్రిని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సత్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments